ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 22, 2020, 3:09 PM IST

ETV Bharat / state

ఇసుక సమస్య పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల నిరసన..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేశారు. ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Construction workers protest  at madanapalle
మదనపల్లెలో భవన నిర్మాణ కార్మికులు నిరసన

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేశారు. ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇసుక కొరత వల్ల కార్మికులకు ఉపాధి పూర్తిగా కరువైందని .. ఆన్​లైన్ విధానం ద్వారా ఇసుక కొనుగోలు కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఇసుక కొరత ఇబ్బందిగా మారిందని వాపోయారు. ఇసుక కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details