ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CONGRESS PROTEST: 'ప్రస్తుత సమయంలో ప్రజలపై భారం సరికాదు' - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది. విద్యుత్ ఛార్జీల భారం మోపి ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నిరసన
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నిరసన

By

Published : Sep 13, 2021, 4:17 PM IST

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరులో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపి పేద ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ భారం మోపడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని చెప్పారు. అనంతరం కలెక్టర్ హరి నారాయణకు వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details