ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2020, 7:53 PM IST

ETV Bharat / state

28న శ్రీకాళహస్తికి సీఎం.. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్​ సమావేశం

శ్రీకాళహస్తిలో ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్​.. అధికారులతో సమావేశం నిర్వహించారు.

Collector meeting
కలెక్టర్​ సమావేశం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 28న సీఎం పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్​ భరత్​గుప్తా స్థానిక అధికారులతో సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగబోయే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఉరందూరులోని ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details