ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన

By

Published : Feb 18, 2021, 1:29 AM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 'స్వర్ణిమ్ విజయ్ దివస్' పేరిట నిర్వహిస్తున్న విజయోత్సవాలలో పాల్గొననున్నారు.

నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన
నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన

సీఎం జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. భారత్ -పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 'స్వర్ణిమ్ విజయ్ దివస్ ' పేరిట నిర్వహిస్తున్న విజయోత్సవాలలో పాల్గొననున్నారు. 1971 యుద్ధంలో పాల్గొని అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. సీఎం జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కార్యక్రమానికి చేరుకుంటారు. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న 'స్వర్ణిమ్ విజయ్ దివస్ ' ఏర్పాట్లను అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details