చిత్తూరు జిల్లా కుప్పం ఆర్.పేట జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను విలీనం చేయవద్దంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చారిత్రక పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని లేఖలో పేర్కొన్నారు.
వందేళ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో 440 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. పాఠశాల విలీనాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఆర్.పేట పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకుని యథాస్థితిని కొనసాగించాలని లేఖలో కోరారు.