ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 15, 2020, 10:45 PM IST

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి: చంద్రబాబు సంతాపం

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమంత్ అనే యువకుడు మృతిచెందాడు. హేమంత్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.

చంద్రబాబు సంతాపం
చంద్రబాబు సంతాపం

చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమంత్ అనే యువకుడు మృతిచెందాడు. హేమంత్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మండలంలోని వెండుగాంపల్లెకు చెందిన హేమంత్ మృతి తనను కలచివేసినట్లు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అతను చిన్నవయసులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details