ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్షుద్ర రాజకీయాల నుంచి.. వైకాపా బయటికి రాదా?: చంద్రబాబు

By

Published : Nov 12, 2022, 3:52 PM IST

CHANDRBABU FIRES ON CM JAGAN : రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యాలపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో తెదేపా కార్యాలయాన్ని ఖాళీ చేయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైకాపా బయటికి రాదా అని ప్రశ్నించారు.

chandrababu fires on ysrcp
chandrababu fires on ysrcp

CBN FIRES ON YSRCP : తగలబెట్టడం, కూలగొట్టడం వంటి సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైకాపా ఇంక బయటకు రాదా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన రెండు ఘటనలు.. వైకాపా రాక్షస రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. పుంగనూరులో తెదేపా కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేయించడానికి స్వయంగా ఎస్పీ బలగాలతో వెళతారా అని నిలదీశారు. ఐపీఎస్​కు మీరు అర్హులేనా అని ప్రశ్నించారు. గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా.. ఇదేనా మీ రాజకీయమని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details