ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2020, 6:38 PM IST

ETV Bharat / state

తిరుపతిలో చైన్​ స్నాచింగ్​ ముఠా అరెస్ట్​

తిరుపతిలో చైన్​ స్నాచింగ్​ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరిని కేవీబీ పురం పోలీస్​ స్టేషన్​కు తరలించారు. గత కొంత కాలంగా కేవీబీ పురం, నగరి మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వీరిపై నిఘా వేసి పట్టుకున్నట్లు పోలీసుల తెలిపారు.

chain snatching gang caught
చైన్​ స్నాచింగ్​ దొంగలు అరెస్ట్​

కేవీబీ పురం, నగరి మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్​ స్నాచింగ్​ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులను తిరుపతిలో అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. కొంత కాలంగా 2 మండలాల పరిధిలో ఎక్కువ సంఖ్యలో దొంగతనాలకు సంబంధించిన ఫిర్యాదులు అందడం వల్ల నిఘాను కట్టుదిట్టం చేశామన్నారు. నిందితులు జయసూర్య, మనోజ్​, వాసుదేవ్​ ఆచారి అనే ముగ్గురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు కేవీబీ పురం పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details