ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 13, 2021, 9:48 AM IST

Updated : Jun 13, 2021, 12:56 PM IST

ETV Bharat / state

Piyush Goyal: శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​ దర్శించుకున్నారు. మంత్రి బుగ్గన ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు ఉదయం తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) పాల్గొన్నారు.

Piyush Goyal
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కేంద్రమంత్రి పీయూష్ గోయల్... తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సేవలో పాల్గొన్న గోయల్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందచేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అంతకు ముందు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పియూష్​ గోయల్(Piyush Goyal), మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తిరమలేశుని దీవేనలు అందరీపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
Last Updated : Jun 13, 2021, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details