ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు

By

Published : Oct 23, 2020, 11:51 AM IST

Updated : Oct 23, 2020, 3:49 PM IST

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారి వాగులో ఓ కారు కొట్టుకుపోయిన ఘటనలో తండ్రీ కుమార్తె గల్లంతయ్యారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.

వాగులో కొట్టుకుపోయిన కారు...ఇద్దరు గల్లంతు
వాగులో కొట్టుకుపోయిన కారు...ఇద్దరు గల్లంతు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో కొండయ్యగారి వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండయ్యగారి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిత్తూరు పట్టణానికి చెందిన ప్రతాప్.. భార్య శ్యామల, కుమార్తె సాయి వినీత, చెంగప్ప అనే మరో వ్యక్తితో కలిసి కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తమ బంధువుల వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో కారులో వాగు దాటేందుకు యత్నించగా.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగడంతో డ్రైవర్​ కిరణ్​ అద్దాలు పగులగొట్టి ఒక్కొక్కరినిని బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సాయి వినీత నీటిలో కొట్టుకు పోతుండడంతో కాపాడేందుకు తండ్రి ప్రతాప్​ ప్రయత్నించాడు. నీటి ప్రవాహానికి ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.

సాయి వినీత మృతదేహం లభ్యం..

వాగులో కారు గల్లంతైన ఘటనలో సాయివినీత మృతదేహన్నిూ సహాయక బృందం వెలికితీసింది. తండ్రి ప్రతాప్ కోసం వాగు పరివాహక ప్రాంతంలో డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి

‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తిన రాజధాని శంకుస్థాపన ప్రాంతం

Last Updated : Oct 23, 2020, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details