ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు.. విగతజీవిగా తిరిగొచ్చాడు!

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వాగులో గల్లంతైన బాలుడి మృతదేహం దొరికింది. విగతజీవిగా కనిపించిన కొడుకును చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మెదుకుకుప్పం మండలం పెరుమాళ్లపల్లెలో జరిగింది.

By

Published : Sep 27, 2020, 4:05 PM IST

Published : Sep 27, 2020, 4:05 PM IST

boy-dead-body-found-those-who-was-missing-in-perumallapalli-vagu-in-chittoor-district
పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు.. శవమై తిరిగొచ్చాడు

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లె గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి కుమారుడు సుమంత్... స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు శనివారం స్థానికంగా ఉన్న వాగుకు వెళ్లాడు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో సుమంత్​ ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు.

సమాచారం తెలుసుకున్న అధికారులు, గ్రామస్థులు అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాలుడి ఆచూకీ దొరకలేదు. ఇవాళ ఉదయం మళ్లీ గాలింపు చేపట్టి వాగు నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. విగతజీవిగా ఉన్న కుమారుడుని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేల రోదిచారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details