ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 7, 2021, 5:13 PM IST

ETV Bharat / state

అరెస్టులపై భాజపా - జనసేన నిరసనలు..

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను, భాజపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ చంద్రగిరిలో భాజపా - జనసేన నాయకులు, కార్యకర్చలు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

bjp janasena rally in chandragiri
భాజపా- జనసేన నిరసనలు

ఆంధ్రప్రదేశ్​లో దేవాలయాలపై జరుగుతున్న దాడులను, భాజపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ భాజపా- జనసేన నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కోదండ రామాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.

చంద్రగిరిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద దేవాలయాలపై దాడులను ఆపాలంటూ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. తరువాత ఎమ్మార్వో కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని భాజపా- జనసేన నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details