ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో అన్యమత ప్రచారం పై భాజపా ఫైర్​

తిరుమల వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం అంశంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో హిందువులు మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. కారకులను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని కోరుతున్నారు.

By

Published : Aug 23, 2019, 12:39 PM IST

తిరుమలలో అన్యమత ప్రచారం పై భాజపా ఫైర్​

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై భాజపా తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని..., హిందువుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వానికిభాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణసూచించారు.

అన్యమత ప్రచారానికి కారకులైన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని... కుట్రలో భాగంగా జరుగుతోందని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. బాధ్యులైన వారిని భక్తుల ముందు నిలబెట్టాలని కోరారు.

తిరుమలలో అన్యమత ప్రచారంపై తెలంగామ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు.... అన్యమత ప్రచారం విషయం సీఎం జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని.... తప్పుచేసిన వారిపై సీఎం చర్యలు తీసుకోవాలి రాజాసింగ్‌ కోరారు

తిరుమలలో అన్యమత ప్రచారం పై భాజపా ఫైర్​

ఇదీ చదవండి

చదరంగం ఆటతో వరద బాధితులకు సాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details