ఈనెల 17 నుంచి అక్టోబర్ 7 వరకు 'సేవ-సమర్పణ' పేరుతో వివిధ ప్రజా ఉపయోగ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తిరుపతిలో ఆయన తెలిపారు. ఈ నెల 17న దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 18న ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసినందుకు ప్రధానిని అభినందిస్తూ 23, 24 తేదీల్లో 5 కోట్ల పోస్టు కార్డులు పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు.
somu veerraju: ఈనెల 17 నుంచి 'సేవ - సమర్పణ': సోము వీర్రాజు - ప్రధాని మోదీ జన్మదినం
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 'సేవ-సమర్పణ' కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమాలు జరపనున్నట్లు తిరుపతిలో ఆయన వెల్లడించారు.
![somu veerraju: ఈనెల 17 నుంచి 'సేవ - సమర్పణ': సోము వీర్రాజు "Service-Samarpana" from the 17th of this month -Somu Veerraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13069615-805-13069615-1631690637857.jpg)
ఈనెల 17 నుంచి "సేవ-సమర్పణ" -సోము వీర్రాజు
తితిదే పాలకమండలిలో సంఖ్యకు మించి సభ్యులను నియామిస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి : TTD: నేడు తితిదే పాలకమండలి ప్రకటన !