ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 7, 2019, 1:04 PM IST

ETV Bharat / state

ఇసుక కోసం భాజపా భిక్షాటన

రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధపాలన వలనే భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారంటూ భాజపా అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ మండిపడ్డారు.

ఇసుక కోసం భాజపా భిక్షాటన

ఇసుక కోసం భాజపా భిక్షాటన
చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట భాజపా అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ భవన నిర్మాణ కార్మికులతో కలిసి భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధపాలన వలనే భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. ఇసుక ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు చేపట్టకపోవటంతో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పదివేల రూపాయలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details