తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులకు బర్డ్లో నగదు రహిత వైద్య సేవలు అందించనున్నారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన బర్డ్ ట్రస్ట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సిమ్స్ తరహాలో తితిదే ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబసభ్యులకు ఉచిత వైద్య సేవలు, సర్జరీలు చేసి తితిదే నుంచి బిల్లు వసూలు చేసుకోవడానికి కమిటీ ఆమోదం తెలిపింది. బర్డ్ ఆసుపత్రిలో రోగులకు ఫిజియోథెరపి చేయడానికి.. రోబో అసిస్టెడ్ గెయిట్ ట్రైనింగ్ థెరఫీ యంత్రం, రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉందో గుర్తించడానికి ఉపయోగపడే 2డీ కలర్ డాప్లర్ యంత్రం కొనుగోలు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది.