తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కోసం తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. శనివారం ఉదయం ఉత్సవమూర్తులకు పుష్పయాగంలో భాగంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఏడు టన్నుల పూలతో పుష్పకైంకర్యం చేయనున్నారు. యాగం కోసం వివిధ రాష్ట్రాల నుంచి విరాళాల రూపంతో కుసుమాలను తితిదే సేకరిస్తోంది.
తిరుమలలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి ఏర్పాట్లు - pushpa yagam in tirumala news
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

వెంకటేశ్వరస్వామి పుష్పయాగానికి ఏర్పాట్లు