ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2020, 4:36 PM IST

ETV Bharat / state

'జగన్ పరిపాలన చేయటం లేదు..ఈవెంట్ మేనేజ్​మెంట్ చేస్తున్నారు'

సంఖ్యని చూపించి వైకాపా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం తగదని..తాము గతంలో ఇంతకంటే ఎక్కువ సంఖ్యతో అధికారం చేపట్టామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయటం లేదని ఈవెంట్ మేనేజ్​మెంట్ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

'జగన్ పరిపాలన చేయటం లేదు..ఈవెంట్ మేనేజ్​మెంట్ చేస్తున్నారు'
'జగన్ పరిపాలన చేయటం లేదు..ఈవెంట్ మేనేజ్​మెంట్ చేస్తున్నారు'

వైకాపా ప్రభుత్వంలో పరిపాలన గాడి తప్పిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయటం లేదని.. ఈవెంట్ మేనేజ్​మెంట్ నిర్వహిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినవేనని.. వైకాపా ప్రభుత్వం వాటి పేర్లు, రంగులు మార్చి వాటినే కొనసాగిస్తుందని ఆక్షేపించారు.

సంఖ్యని చూపించి బెదిరింపులకు పాల్పడటం తగదని..తాము గతంలో ఇంతకంటే ఎక్కువ సంఖ్యతో అధికారం చేపట్టామన్నారు. రాష్ట్రంలో డబ్బులు పంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటే ఎలాగని శైలజానాథ్ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details