ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 12, 2021, 5:25 PM IST

ETV Bharat / state

FIBERNET: మారుమూల గ్రామాలకూ ఫైబర్ నెట్ సేవలు: గౌతమ్ రెడ్డి

తిరుపతిలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ గౌతమ్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం ఫైబర్ నెట్ సేవలు అందిస్తామని వెల్లడించారు.

AP Fiber Net Corporation Chairman Dr. goutham reddy
తిరుపతిలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం

రాష్ట్రంలోని మూరుమూల గ్రామాలకు సైతం ఏపీ ఫైబర్ నెట్ తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన.. జిల్లాలో అందిస్తున్న ఫైబర్ సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఐఐటీ కళాశాలలతో పాటు జిల్లాలోని శ్రీ సిటీలో కూడా ఫైబర్ నెట్ సేవలు విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details