చిత్తూరు జిల్లా.. పడమటి మండలాల్లో లాక్డౌన్ అమలవుతోంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని తల్లులు, పిల్లలకు ఐసీడీఎస్ అధికారులు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. మే ఆఖరి వరకు సరిపోయే విధంగా 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటర్ నూనె, 23 గుడ్లు, 4 లీటర్ల పాలు, పిల్లలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్లు, 8 గుడ్లు ఇంటింటికీ వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ సీడీపీఓ లు తంబళ్లపల్లె ప్రాజెక్టు పరిధిలోని కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించారు.
తల్లీపిల్లలకు నేరుగా ఇంటికే పౌష్టికాహారం
చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ పరిధిలో ఉన్న తల్లీ, పిల్లలకు ఐసీడీఎస్ అధికారులు నేరుగా ఇంటికే వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారు.
anganwadi centers in chittor