లాక్డౌన్ నిబంధనల సడలింపులతో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో తెరుచుకున్న మద్యం దుకాణం తొలి రెండురోజులు మందుబాబులతో కిక్కిరిపోయింది. ప్రస్తుతం కొనుగోలుదారులు లేక వెలవెలబోయింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కండ్రిగ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతం. తమిళనాడులో లాక్డౌన్ అమలు కొనసాగుతున్న కారణంగా కండ్రిగలోని మద్యం దుకాణాల ముందు మందుబాబులు మొదటి రెండురోజులు బారులు తీరారు. కానీ ప్రస్తుతం దుకాణాల వద్ద వినియోగదారులు కనిపించడం లేదు.
ఇక్కడ మద్యం దుకాణాలు వెలవెలబోతున్నాయి..! - Andhra Tamil Nadu border wine shops news
ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా కండ్రిగలో తెరుచుకున్న మద్యం దుకాణాల వద్ద తొలి రెండు రోజులు కనిపించిన మందుబాబులు... ప్రస్తుతం కనిపించడం లేదు. మరోపక్క జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రాష్ట్రానికి అక్రమంగా తీసుకొస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
![ఇక్కడ మద్యం దుకాణాలు వెలవెలబోతున్నాయి..! వెలవెలబోతున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు మద్యం దుకాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7103986-726-7103986-1588865646481.jpg)
వెలవెలబోతున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు మద్యం దుకాణం
జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం గారచెట్లపల్లి గ్రామం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఈ గ్రామం ద్వారా కర్ణాటక రాష్ట్ర మద్యాన్ని చిత్తూరు జిల్లాకు అక్రమంగా తీసుకొస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ములకలచెరువు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి:'మద్యం దుకాణాలతో అనర్థాలు తప్పవు'
Last Updated : May 7, 2020, 11:49 PM IST