ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర మద్యం తమిళనాడుకు రవాణా.. ఐదుగురు అరెస్ట్ - latest crime news

చిత్తూరు జిల్లా పరిధిలో.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడుకు మద్యం తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Andhra liquor  smuggling to Tamil Nadu
ఆంధ్ర మద్యం.. తమిళనాడుకు ఆక్రమ రవాణా..

By

Published : May 16, 2020, 1:27 PM IST

చిత్తూరు జిల్లా పరిధిలో.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో మద్యం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో తమిళనాడు - ఆంధ్రా సరిహద్దులో గల ఆంధ్ర చెక్ పోస్టులను పటిష్టపరచారు.

ఈ క్రమంలో... తమిళనాడు రాష్ట్రంలో మద్యం లభించనందువల్ల కొందరు తమిళనాడు వ్యక్తులు ఆంధ్రలోకి వచ్చి.. ఇక్కడి మద్యాన్ని అక్కడికి తరలిస్తూ.. పట్టుబడ్డారు. నగిరి - తమిళనాడు సరిహద్దులోని పూని - మాంగాడు చెక్ పోస్ట్ వద్ద నగిరి పోలిసు తనిఖీలు చేస్తుండగా టాటా సఫారీ వాహనంలో ఐదుగురు వ్యక్తులు 7 ఫుల్ బాటిల్స్, 3 హాఫ్ బాటిల్స్, 125 క్వార్టర్ బాటిల్ అక్రమoగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు.

వీరందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి మద్యం వాహనాన్నీ సీజ్ చేశారు. పట్టుబడిన ఐదుగురు నిందితులను రిమాండ్ కు పంపినట్లు నగిరి సీఐ మద్దయ్య అచారి తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా భార్గవి

ABOUT THE AUTHOR

...view details