అమరావతి కోసం తిరుమల మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు రాజధానిపై అభిమానం చాటుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం తెలుగు యువత అధ్యక్షుడు డి. చౌదరి, పూజిత దంపతులు రాజధాని అమరావతిలోనే ఉండాలనే ఆకాంక్షతో అలిపిరి నడక మార్గంలో మోకాళ్ళపై ఎక్కుతూ కొండపైకి చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా కాపాడాలని కోరుకున్నారు.
అమరావతి కోసం తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచిన దంపతులు - amaravathi latest news
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచారు ఆ దంపతులు . అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ స్వామివారికి మొక్కుకున్నారు. రైతులకు అన్యాయం జరగకుండా కాపాడాలని వేడుకున్నారు.
tirumala