చిత్తూరు నగరంలోని ఓ బంగారు ఆభరణాల దుకాణం యజమాని నివాసంలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని దుర్గమ్మ గుడి సమీపంలో ముద్దాయి నార బసవరాజు అలియాస్ రాజును అరెస్ట్ చేశారు. పెద్దపుజర్ల గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూల్ జిల్లాకు చెందిన బసవరాజు నుంచి 500 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
కారు స్వాధీనం..
కొంత బంగారు నగలు విక్రయించి నిందితుడు కొనుగోలు చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. చోరీ ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని జిల్లా ఏఎస్పీ మహేశ్ తెలిపారు.