ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2020, 10:38 AM IST

ETV Bharat / state

బస్​షెల్టర్​ను ఢీకొన్న లారీ.. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు

ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన ఘటన పీలేరు-రాయచోటి జాతీయ రహదారిపై జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ బస్​షెల్టర్​ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.

road accident
రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా పీలేరు-రాయచోటి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. నివర్ తుపాను దెబ్బకు సొరకాయలపేట చెరువు కట్ట దెబ్బతిన్న కారణంగా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కడప నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి బస్ షెల్టర్​ను ఢీకొంది. అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆదినారాయణ, సుభాష్​లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details