చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట మురుగు కాలువలో.. అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమైంది. మురుగు కాలువలో మగశిశువు మృతదేహం ఉండటాన్నిస్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. స్థానికులు చేశారా? లేక బయటి నుంచి వచ్చిన వ్యక్తులు శిశువును ఇక్కడ పడేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
శ్రీకాళహస్తిలో దారుణం... మురుగుకాలువలో శిశువు మృతదేహం - chittoor district updates
అప్పుడే పుట్టిన పసికందు మురుగుకాలువలో శవంగా మారిన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. మురుగు కాలువలో శిశువు మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మురుగుకాలవలో శిశువు మృతదేహం