ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మా నన్ను వదిలేస్తుంటే... నీకు పాపం అనిపించలేదా..! - చిత్తూరు మల్లెల గ్రామంలోపసికందును వదిలేసిన తల్లి

అమ్మకి ఆ పసిపాప బరువు అనుకుందేమో...! అభంశుభం తెలియని ఆ పసికందును ఓ దేవాలయంలో వదిలెల్లింది. ఈ హృదయవిదారక సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని మల్లెల గ్రామంలో జరిగింది.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/28-November-2019/5204655_pp.png
పురిటి బిడ్డ

By

Published : Nov 28, 2019, 7:21 PM IST

అమ్మా నన్ను వదిలేస్తుంటే... నీకు పాపం అనిపించలేదా..!

ఆ తల్లికి ఏమైందో ఏమో... చిన్నారిని వదిలించుకుంది. పురిటి బిడ్డను పాడుబడ్డ దేవాలయంలో వదిలివెళ్లి... పేగుబంధాన్ని తెంచుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని మల్లెల గ్రామంలో జరిగింది. ఆలయం దగ్గరలో... పసికందు ఏడుపు విని... స్థానికులు అంగన్వాడీ కార్యకర్తకు సమాచారం అందించారు. ఆమె ఆ పసికందును బీ.కొత్తకోటకు తీసుకెళ్లి... స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేయించింది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశంతో... ఆ పసిబిడ్డను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాప ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన తర్వాత... జిల్లా శిశు సంక్షేమ కేంద్రానికి తరలిస్తామని ఐసీడీఎస్ అధికారిని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details