ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 19, 2019, 1:57 PM IST

ETV Bharat / state

ప్రత్యేక హోదా సాధనకై.. దివ్యాంగుడి సైకిల్ యాత్ర

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ వ్యక్తి తలచాడు. తన అవిటి తనాన్ని పక్కన పెట్టి ప్రత్యేక హోదా కోసం సైకిల్​ యాత్ర చేపట్టారు. ప్రత్యేక హోదా అని మాటలు తప్ప చేతల్లో చూపించని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏపీకి హోదా కోసం తాను సైతం అంటోన్న ఆ సిక్కోలు బిడ్డ గురించి మనమూ తెలుసుకుందామా..!

a disabled person neyyala Prasad Bicycle trip for andhrapradesh special status, chittoor district
ప్రత్యేక హోదా సాధనకై.. దివ్యాంగుడి సైకిల్ యాత్ర

ప్రత్యేక హోదా సాధనకై.. దివ్యాంగుడి సైకిల్ యాత్ర

'ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో హోదా స్ఫూర్తిని రగిలిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నెయ్యల ప్రసాద్. దివ్యాంగుడైనా.. తన అవిటితనాన్ని లెక్క చేయకుండా ట్రై సైకిల్​పై రాష్ట్రమంతటా పర్యటిస్తునారు. హోదా సాధనే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన అతని యాత్ర ఇప్పటివరకు పది జిల్లాల్లో పూర్తయింది. బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరుకు చేరుకున్న అతనిని ఈటీవీ భారత్ పలకరించింది. హోదా సాధనే ధ్యేయంగా సాగుతున్న తన యాత్రా విశేషాలను... తన లక్ష్యాల్ని ఈటీవి భారత్​తో పంచుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details