తిరుమలలో పెళ్లి చేసుకోవాలని కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నుంచి ఓ జంట తిరుపతికి చేరుకుంది. కరోనా ప్రభావంతో తిరుమలకు అనుమతి నిలిపివేశారు. ఫలితంగా ఆ జంట అలిపిరిలోనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. తిరుమలలోనే పెళ్లి చేసుకుందామనుకున్నవారిని ఒప్పించి... తిరుపతి డీఎస్పీ నాగసుబ్బన్న పెళ్లి చేశారు. గరుత్మంతుని సాక్షిగా నడిరోడ్డుపై వారికి విహహం జరిపించారు. చుట్టుపక్కల వారు... ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు.
కరోనా ప్రభావం..నడిరోడ్డుపై వివాహం - corona news in tirumala
మూడు నెలల ముందే వారు పెళ్లి పనులు మొదలుపెట్టారు. తిరుమల వెంకన్న సన్నిధిలో తాళి కట్టడమే మిగిలింది అనుకున్నారు. కానీ కరోనా వారిని శ్రీవారి చెంతకు పోకుండానే ఆపింది. చివరికి చేసేదేమీ లేక అలిపిరి టోల్గేటు వద్దనే ఒక్కటయ్యారు.
పోలీసుల సమక్షంలో నడిరొడ్డుపై ఓ జంట పెళ్లి