ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2021, 9:59 PM IST

ETV Bharat / state

నాటు బాంబు పేలి.. వ్యక్తికి గాయాలు

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి మండలంలోని గౌడసానివారిపల్లెలో నాటు బాంబు పేలి ఓ వ్యక్తి గాయపడ్డాడు. పశువులకు పాలు పితకడానికి వెళ్లిన ఆయన.. నిమ్మకాయ సైజులో ఉన్న నాటు బాంబును పట్టుకోవడంతో, ఒక్కసారిగా పేలి.. చేతి వేళ్ళు ఊడిపోగా.. కుడికాలుకు గాయాలయ్యాయి.

A bomb exploded Serious injuries to a person at Thambalpally Zone in Chittoor District
నాటు బాంబు పేలి.. వ్యక్తికి తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి మండలంలోని గౌడసానివారిపల్లెలో నాటు బాంబు పేలి గౌడసాని రమణా రెడ్డి గాయపడ్డాడు. తక్షణమే కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పశువుల కొట్టంలో పాలు పితకడానికి వెళ్లగా.. నిమ్మకాయ సైజులో ఉండ కనిపించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాన్ని చేత్తో పట్టుకొని విసిరేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలిందని పేర్కొన్నాడు. ఈ ప్రమాదంలో అతని చేతి వేళ్ళు ఊడిపోగా.. కుడికాలు తీవ్రంగా దెబ్బతింది.

ABOUT THE AUTHOR

...view details