ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోజా చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో 5కే మారథాన్

By

Published : Dec 22, 2020, 12:33 PM IST

చిత్తూరు జిల్లా నగరిలో రోజా చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో 5కే మారథాన్​ నిర్వహించారు. నియోజకవర్గంలోని ఒక్కో మండలం నుంచి రెండు విభాగాల్లో 250 మంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆర్.కె.రోజా విజేతలకు బహుమతులు అందజేశారు.

5K Marathon
5కే మారథాన్

నగరి మున్సిపాలిటీలోని సత్రవాడ నుంచి ఓంశక్తి ఆలయం వరకు 5కే మారథాన్ జరిగింది. సీఎం జగన్​ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రోజా చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఒక్కో మండలం నుంచి రెండు విభాగాల్లో 250 మంది పాల్గొన్నారు.

పట్టణంలోని ఎ.జె.ఎస్ కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రికి జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతిగా రూ.10,000, రెండవ విజేతకు రూ. 7,000, మూడవ బహుమతిగా రూ.4,000, నవరత్నాలుగా తొమ్మిది మందికి ఒకొక్కరికి వెయ్యి రూపాయలు బహుమతిగా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details