తిరుమలలో విజిలెన్స్ అధికారులు 23 మంది దళారులను అరెస్టు చేశారు. దర్శనం టికెట్లు, ప్రసాదాలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దళారీ వద్ద రూ.14వేల 500కు 3 టికెట్లు, రూ.7 వేలకు 2 టికెట్లు పొందినట్లు భక్తులు తెలిపారు. దళారీ శ్రీనివాసులునాయుడిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. ఆతనికి సహకరిస్తున్న మరో 22 మంది అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో ముగ్గురు తితిదే ఉద్యోగులున్నారు.
తిరుమలలో 23మంది దళారుల అరెస్టు - తిరుమలలో దళారుల అరెస్టు
తిరుమలలో దర్శనం టికెట్లు, ప్రసాదాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో 23 మంది దళారులను పోలీసులు అరెస్టు చేశారు.
తిరమలలో దళారుల అరెస్టు
ఇదీ చదవండి
Last Updated : Oct 21, 2019, 9:24 PM IST