ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు కింద పడి ఇద్దరు యువకులు మృతి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

పీలేరు మండలంలో ఎర్రగుంటపల్లి సమీపంలో రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రైలు కింద పడి ఇద్దరు యువకుల మృతి

By

Published : Nov 19, 2019, 10:49 AM IST

రైలు కింద పడి ఇద్దరు యువకుల మృతి

చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. రైల్వే ట్రాక్​ పరిశీలనకు వెళ్లిన గ్యాంగ్​మెన్​ఎర్రగుంటపల్లి సమీపంలోని రైల్వేట్రాక్​పై మృతదేహాలను గుర్తించి.. గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోదా చేసి... అక్కడ లభించిన ఏటీఎం, చరవాణీలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతులు చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన శివకుమార్ (24), పీలేరు పట్టణం కావలిపల్లికి చెందిన సాయి(23)గా గుర్తించారు. సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details