150 మంది గాంధీలను చూస్తారా? చిత్తూరు జిల్లా తిరుపతిలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు గాంధీ వేషధారణలతో ఆకట్టుకున్నారు. 150మంది చిన్నారులు గాంధీ ఆహార్యంలో దర్శనమిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. గాంధీజీ ఆశయాలను తెలిపే చిత్రాల ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులు గీసిన గాంధీ చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని ఈ సందర్భంగా విద్యార్ధులకు ఉపాధ్యాయులు బోధించారు. ఎన్ని తరాలు గడిచినా మహాత్మాగాంధీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.