పోతురాజులతో నృత్యం చేసిన తెలంగాణ మంత్రి - ఉజ్జయినీ బోనాలు
డప్పు చప్పుళ్లు వింటే ఎవరికైనా చిందేయాలనిపిస్తుంది. ఉజ్జయిని మహంకాళి బోనాలు సందర్భంగా జరిగిన తొట్టెల ఊరేగింపులో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోతురాజులతో కలిసి నృత్యం చేశారు.

పోతురాజులతో నృత్యం చేసిన తెలంగాణ మంత్రి
తెలంగాణలో శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. పోతురాజులు విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాల మధ్య తొట్టెల ఊరేగింపు బండ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోతురాజులతో కలిసి నృత్యం చేశారు. ఆద్యంతం భక్తిలో మునిగి అందరితో కలిసి నృత్యాలు చేస్తూ అలరించారు.
పోతురాజులతో నృత్యం చేసిన తెలంగాణ మంత్రి