ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 16, 2019, 8:46 PM IST

ETV Bharat / state

ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోంది: తెదేపా

ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోందని తెదేపా నేత రామానాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలోనూ కాపులపై చిన్నచూపు చూశారని... జగన్ సైతం అదే చేస్తున్నారన్నారు.

రామానాయుడు

రామానాయుడు

వైఎస్ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ సామాజికవర్గ నేతలు రామానాయుడు ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం ఇచ్చే ప్రయత్నం చేసిందన్న రామానాయుడు... సీఎం జగన్ ఏ ప్రయత్నం చెయ్యకుండానే కాపులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈబీసీ కింద కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా లేదా సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details