ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫొనితో రైల్వేకు తీవ్ర నష్టం.. విమానయానంపైనా ప్రభావం

ప్రచండ తుపాను ఫొని ప్రభావం.. రైల్వేతో పాటు, విమానయానంపై తీవ్రంగా పడింది. తీరం దాటినా.. ఇంకా రాకపోకలు పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు.

By

Published : May 4, 2019, 5:36 PM IST

phoni effect

తుపాను నష్టంపై తూర్పుకోస్తా రైల్వే అధికారుల సమీక్షించారు. ఫొని తుపాను కారణంగా రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు చెప్పారు. పూరీ-భువనేశ్వర్ - ఖుర్దా రోడ్‌లో నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖ - చెన్నై మార్గంలో పాక్షికంగా రైళ్లు పునరుద్ధరించామనీ.. భువనేశ్వర్ - ఖుర్దా రోడ్‌ మార్గాన్ని పాక్షికంగా సిద్ధం చేశామని వివరించారు. ఈ మార్గంలో కొన్ని రైళ్లనే అనుమతిస్తున్నామని.. ఈ నెల 10 వరకూ పూరీకి వెళ్లే రైళ్లన్నీ నిలిపేశామనీ చెప్పారు.

59 విమానాలు రద్దు

ఫొని తుపాను వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో పలు విమానాలు రద్దు చేశారు. గువాహటి నుంచి రాకపోకలు సాగించే 59 విమానాల రాకపోకలు నిలిపేశారు. అగర్తలా నుంచి 8 విమానాలు.. దిమాపూర్‌ నుంచి 2.. లీలాబరి నుంచి 2.. దిబ్రూగఢ్‌ నుంచి 4.. ఇంఫాల్‌ నుంచి రాకపోకలు సాగించే 6 విమానాలు రద్దు చేశారు.

ABOUT THE AUTHOR

...view details