ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మై ఓట్​ క్యూ యాప్...పని చేసిందెక్కడ? - 2019 elections

ఇప్పుడు నడుస్తున్నది యాప్​ల ట్రెండ్.. ఎన్నికల సంఘం కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని..పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల కోసం మై ఓట్ క్యూ యాప్​ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఎలాంటి సమాచారం ఇందులో పొందుపరచకపోవడంతో... ఈ యాప్​ పనితీరుపై విమర్శలు వచ్చాయి.

మై ఓట్​ క్యూ యాప్...పని చేసిందెక్కడ?

By

Published : Apr 12, 2019, 5:19 AM IST


పోలింగు కేంద్రం వద్ద క్యూలైన్ లేదనుకున్నప్పుడే ఓటర్లు వెళ్లి వద్దామనుకుంటారు. ఈ నేపథ్యంలో ఓటరు ఆలోచనలకు అనుగుణంగా ఏ పోలింగు కేంద్రంలో ఎప్పుడు ఓటర్ల క్యూ ఎలా తెలియజేసేలా..ఒక యాప్​ సిద్ధం చేసినట్లు ఈసీ ప్రకటించింది. దాన్ని వినియోగిస్తూ ఏ పోలింగు కేంద్రం సమాచారమైనా తెలుసుకోవచ్చని, కాళీగా ఉన్న సమయాన్ని గుర్తించి ఓటు వేయవచ్చని తెలిపింది.
మై ఓట్ క్యూ యాప్​లో ప్రతి 5 నిమిషాలకు సమాచారాన్ని నవీకరిస్తామని, తాజా పరిస్థితులు తెలుసుకోవచ్చని ఈసీ పేర్కొంది. అసలు ఇలాంటి సమాచారం ఏదీ ఆ యాప్​లో పొందుపరచలేదు. ఈ యాప్ వినియోగించిన ఓటర్లకు ఎప్పుడు చూసినా...నో క్యూ యాడెడ్ ఎట్(ఆ సమాచారం ఏదీ ఇందులో పొందుపరచలేదు) అన్న సమాధానమే కనిపించింది. యాప్​లో సమాచారం పెట్టినట్లు కనిపించలేదు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details