నూజివీడు, ఉలవపాడు రైతులకు రెండింతల లాభం కలిగేలా.. రియల్ మిల్క్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటోంది. పంట మొత్తం ఒకేసారి కాకుండా పక్వానికి వచ్చినవి, పెద్దవి ఎంచుకుని కోస్తారు. ఇలా ఒక చెట్టు నుంచి మూడు నుంచి నాలుగు సార్లు కాయలు కోస్తుంటారు. ఇలా.. రసాయనాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పండ్లు సేకరిస్తారు. ప్రత్యేక అట్ట పెట్టెల్లో ప్యాక్ చేసి దూర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారికి నేరుగా ద్విచక్ర వాహనంపై డెలివరీ బాయ్స్ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వినియోగదారులకు కేజీ మామిడి పండ్లను 120 నుంచి 130 రూపాయలకు విక్రయిస్తున్నారు.
వినియోగదాలకు తమ సంస్థ పై ఏమైనా అనుమానాలుంటే... స్వయంగా వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అక్కడ రోజు మొత్తం ఉండి పరిశీలించాకే ఓ నిర్ణయానికి వచ్చేలా భవిష్యత్తులో ప్రయత్నిస్తామంటున్నారు.