ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదురై బెంచ్ తీర్పు...కేంద్రానికి మేలుకోలుపు!

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగానికి లోబడి ఉంటాయని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడితే... కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటారని చెప్పారు.

By

Published : May 1, 2019, 9:55 PM IST

మదురై బెంచ్ తీర్పు...కేంద్రానికి మేలుకోలుపు!

మదురై బెంచ్ తీర్పు...కేంద్రానికి మేలుకోలుపు!

గడిచిన నాలుగేళ్లలో గవర్నర్ వ్యవస్థను భాజపా వాడుకుంటుందని... తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అమరావతిలో వ్యాఖ్యానించారు. మితిమీరి.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం తల దూరుస్తోందని మండిపడ్డారు. ఈ విషయాలపై సుప్రీం కోర్టు మెుట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. మదురై హై కోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోనూ.. సాధారణ పరిపాలనలో వేలుపెట్టే హక్కు సీఎస్​కు హక్కు లేదన్నారు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆక్షేపణ పెడితే అభ్యంతరం లేదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details