ఈసీపై పోరాడతా.. సహకరించండి: పాల్ - general elections 2019
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ విమర్శించారు. ఈసీ తీరుపై పోరాటం చేస్తానని చెప్పారు.
కేఏ పాల్
By
Published : Apr 12, 2019, 11:42 PM IST
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. దిల్లీలో ఎన్నికల సంఘంపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల మొరాయింపు, ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో మాట్లాడేందుకు ప్రయత్నించగా అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత సహకరిస్తే పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు.