ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విలేకరులకు' ఎకరా రూ.10 లక్షలకే!

విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయమై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుంది. అమరావతిలో ఎకరా 10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయించింది.

By

Published : Feb 13, 2019, 2:20 PM IST

కాలవ శ్రీనివాసులు

కాలవ శ్రీనివాసులు
విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయమై మంత్రివర్గంలో నిర్ణయం తీసున్నామని మంత్రి కాలవ శ్రీనివాసులు విజయవాడలో చెప్పారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపుకోసం ఇప్పటి వరకు ఎకరాకు 25 లక్షలు నిర్ణయించామన్నారు. అంతమొత్తం చెల్లించలేమని విలేకరులు చెప్పారని.. ఈ కారణంగా ఎకరా 10 లక్షల రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రెండేళ్ల లోపు మూడు విడతల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించామని మంత్రి తెలిపారు. అమరావతి పరిధిలో పనిచేసే పాత్రికేయులకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యనించారు. విభజన హామీల సాధన కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. కేంద్రం పై రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details