ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ కేసులో మరో అధికారికి ఊరట - jagan caselo maro adhikari urata

జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్​కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది.

high court

By

Published : Feb 4, 2019, 11:51 PM IST

జగన్ అక్రమాస్తుల కేసులో మరో ఐఏఎస్ అధికారికి హైకోర్టులో ఊరట లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్​పై సీబీఐ కేసును తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వైఎస్ హయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన ఆదిత్యనాథ్ దాస్... ఇండియా సిమెంట్స్​కు లబ్ధి చేకూర్చారనేది సీబీఐ అభియోగం. ప్రతిఫలంగా ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్... జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని తెలిపింది. ఆదిత్యనాథ్ దాస్ ప్రాసిక్యూషన్​కు కేంద్ర, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ప్రాసిక్యూషన్​కు అనుమతి లేకుండా ఛార్జి​ షీట్ దాఖలు చేయడాన్ని చట్ట విరుద్ధమన్న దాస్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అభియోగపత్రాన్ని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడాన్ని తప్పుపట్టింది. ఇదే కారణంతో ఇటీవల ఆదిత్యనాథ్ దాస్​పై ఈడీ కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.

ABOUT THE AUTHOR

...view details