ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో చేరుతా: జైరమేశ్

ఎన్నికల్లో పోటీ చేసినా... చేయకపోయినా జగన్ పార్టీకి సేవ చేస్తానని దాసరి జైరమేశ్ పేర్కొన్నారు.

By

Published : Feb 15, 2019, 11:44 PM IST

మీడియాతో మాట్లాడుతున్న జై రమేశ్

హైదరాబాద్ లోటస్​పాండ్​లో దాసరి జైరమేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా అధినేత జగన్​ను కలిశారు. త్వరలోనే వైకాపాలో చేరబోతున్నట్లు జైరమేశ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా... చేయకపోయినా పార్టీకి సేవ చేస్తానని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు. 2001 నుంచి తెదేపాకు దూరంగా ఉన్నాని... పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందించానని చెప్పారు. తెలుగుదేశం నుంచి ఏమీ ఆశించలేదని...లబ్ధి పొందలేదని తెలిపారు.

మీడియాతో మాట్లాడుతున్న జై రమేశ్

ABOUT THE AUTHOR

...view details