ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులు..!?

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేలోపే తన ప్రభుత్వంలో పనిచేయనున్న అధికారులను ఎంపిక చేసుకుంటున్న జగన్... అవినీతి నిరోధకశాఖలోనూ అధికార మార్పిడి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఏసీబీడీజీ ఏబీ వెంకటేశ్వరరావు స్థానంలో... విజయవాడ సీపీగా పనిచేస్తున్న ద్వారకా తిరుమలరావును నియమించే అవకాశాలు ఉన్నాయి.

By

Published : May 29, 2019, 7:47 AM IST

జగన్ అధికారుల బృందం

ముఖ్యమంత్రి నియంత్రణలో పనిచేసే అవినీతి నిరోధక శాఖకు డైరెక్టర్ జనరల్​గా కొత్త అధికారిని నియమించాలని జగన్​ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ పోలీసు కమిషనర్​గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును ఏసీబీ డీజీగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అధికారుల కూర్పునకు కొత్త డీజీపీగా నియమితులు కానున్న గౌతమ్ సవాంగ్... పలుమార్లు జగన్​తో భేటీ అవుతున్నారు.

ఇంటలిజెన్స్ చీఫ్​గా తెలంగాణ పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్రతోపాటు... కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులను నియమించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో కీలకమైన అవినీతి నిరోధక శాఖకు డీజీగా కొత్త అధికారిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత... మార్పు చేర్పులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details