పింఛన్దారులకు మధ్యంతర భృతి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పింఛన్దారులకు 27 శాతం మేర మధ్యంతర భృతి పెంచుతూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 వేతన సవరణ పొంది... 2013 జులై 1 తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఆ తేదీ కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ మధ్యంతర భృతి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. జాగీరు, ఎస్టేట్ పెన్షనర్లు, 1980 పింఛన్ వేతన నిబంధనలకు అనుగుణంగా ఉన్న సర్వీసు పెన్షనర్లకు ఈ పెంపును వర్తింప చేయనున్నారు.
మధ్యంతర భృతి 27శాతం పెంచుతూ ఉత్తర్వులు - cm jagan
పింఛన్దారులకు మధ్యంతర భృతి 27 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల మాదిరిగానే ఈ ఏడాది జులై 1 నుంచి పింఛన్దారులకు వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
![మధ్యంతర భృతి 27శాతం పెంచుతూ ఉత్తర్వులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3879228-451-3879228-1563471159392.jpg)
మధ్యంతర భృతి 27శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు