పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి మచిలీపట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన ఫొని. మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు దిశలో .. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. బలమైన గాలులతో తుపాను ఉధృతంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ పారాదీప్ వద్ద తీరాన్ని తాకి బలహీనపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి స్పష్టం చేస్తోంది.
ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం
ఫొని ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావంతో విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. రేపు, ఎల్లుండి తీవ్ర గాలులతో కనిష్టంగా 120 మిల్లీ మీటర్ల నుంచి 180 మిల్లీ మీటర్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి