బడ్డెట్కు వేళాయే... రేపు ఉదయమే మంత్రివర్గ ఆమోదం!
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రభుత్వం రేపు ప్రవేశ పెట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయింది.
రేపు ఉదయం సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. వైకాపా ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్కు ఉదయం 8 గంటలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం శాసనసభలో రేపు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ... వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తన సోదరుడి ఆకస్మిక మృతితో సభకు హాజరుకాలేకపోతున్నందున మంత్రి బొత్స వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనమండలిలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశ పెట్టనున్నారు.