ఒడిశాకు సాయం కొనసాగిస్తాం: చంద్రబాబు - chandrababu
ఫొని తుపాన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒడిశాకు రాష్ట్రం ప్రభుత్వం తరపున సాయం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు.

ఒడిశాకు సాయం కొనసాగిస్తాం:సీఎం చంద్రబాబు
ఫొని నుంచి కొలుకునేందుకు ఒడిశాకి ఏపీ సాయం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు. సోదర రాష్ట్రం సాధారణ స్థితికి వచ్చేంత వరకూ తోడ్పాటు అందిస్తామని ఆయన అన్నారు. ఏపీ నుంచి 2055 మందితో కార్మిక బృందాన్ని ఒడిశాకి పంపుతున్నామని తెలిపారు. ఇంధన శాఖ నుంచి స్టాఫ్, షిఫ్ట్ ఆపరేటర్లు, వర్కర్లు ఈ బృందంలో ఉంటారని, విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో వీరంతా పాల్గొని ఒడిశాలో త్వరగా సాధారణ స్థితి నెలకొల్పేందుకు పని చేస్తారని చంద్రబాబు తెలిపారు.