దిల్లీ ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు హోదా ఇస్తామని చెప్పి ఇన్నాళ్లూ మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపాపై ధ్వజమెత్తారు. విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రధాని ఆనంద పడుతున్నారన్న చంద్రబాబు...రాష్ట్ర హక్కుల సాధనకు పట్టుదలతో పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.
మోదీకి కుటుంబం ఉంటే దాని విలువ తెలిసేదని చంద్రబాబు విమర్శించారు. వ్యక్తిగత దాడి మొదలుపెడితే మోదీ ఎక్కడ ముఖం పెట్టుకుంటారని ప్రశ్నించారు. మోదీ, అమిత్షా కలిసి స్వతంత్ర వ్యవస్థలను నాశనం చేస్తున్నారని అన్నారు. పలు పార్టీల నేతలు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.